ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

457చూసినవారు
ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పిఎన్ క్రికెట్ మైదానంలో ఈ రోజు కాగజ్ నగర్ వార్డ్ ప్రీమియర్ లీగ్ ను.. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేర్ వంశీ ప్రారంభించారు. కాగజ్నగర్ పట్టణంలోని 30 వార్డు నుండి టీమ్స్ ను ఎన్నిక చేసారు. ఎంట్రీ ఫీజు 2000 కాగా, టోర్నమెంట్ విన్నర్ కు 25,000, రన్నరప్ 15 వేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. సెమీ ఫైనల్స్ నుండి ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వారికి పదివేల రూపాయలు నగదును మెహిఫీల్ హోటల్ హైదరాబాద్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని సంఘటితం చేసి అందుకే, యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే ఈ క్రికెట్ టోర్నమెంట్లో నిర్వహిస్తున్నట్లు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ తెలిపారు.