అధైర్య పడొద్దు అండగా నేనున్నా
బెజ్జూర్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి నాయకులు మేశ్రం రాజారామ్ కుమారుడు శ్రీకాంత్ సోమవారం మృరి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆధైర్య పడొద్దు అండగా ఉంటానని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వారి వెంట బీజేపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.