అశ్వారావుపేటలోని ట్రెండ్స్ స్టోర్లో సోమవారం రాత్రి గుర్తు. తెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్టోర్ సూపర్వైజర్ తెలిపారు. విద్యుత్ వైర్లను కత్తిరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.