
ములకలపల్లి: ఓణీల వేడుకలో పాల్గొన్న తాండ్ర, అంజి
ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో జరిగిన తాటి లక్ష్మణ్ రాజమ్మ కుమార్తె లాస్య ఓణీల వేడుకలో ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు భక్తుల అంజి మంగళవారం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మెచ్చు వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు కారం సుధీర్, రాజేష్, మడకం శ్రీను, సున్నం సునీత, తాటి తులసి, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.