పదిలో 84 శాతం ఉత్తీర్ణత
చండ్రుగొండ మండలంలో 233 మంది విద్యార్దులకుగాను 195 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం విడుదలైన పది ఫలితాల్లో మండలంలో 84 శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించిన్నట్లు మండల విద్యశాఖాధికారి సత్యనారాయణ అన్నారు. పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.