ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహణ

1244చూసినవారు
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీ నాయకపొడ్ లు అశ్వరావుపేట నియోజకవర్గం లో రాజకీయంగా ఆర్థికంగా మరియు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని ఆ దిశగా యువత అభివృద్ధి చెందాలని అదేవిధంగా రానున్న రోజుల్లో నాయక పోడులు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలని ఈ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల నారాయణ , మండల అధ్యక్షులు ఊరబెద్ది వెంకన్న , ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి, కమలాపురం సర్పంచ్ గొల్ల పెంటయ్య, గ్రామ కమిటీ సభ్యులు గొల్ల వీరభద్రం, చిటిక రామకృష్ణ, చిర భద్రయ్య, జక్క ఉపేందర్ , జక్కా రాంబాబు, చేదం రాందాసు, లింగాల నరేష్, మట్ల రమేష్, గుజ్జల భీమరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్