డిపీఓ ఆకస్మిక తనిఖీ

67చూసినవారు
డిపీఓ ఆకస్మిక తనిఖీ
అశ్వారావుపేట మండలంలోని పాతరెడ్డిగూడెంలో శనివారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి ఆకస్మికంగా తనిఖీ
చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, వన నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ప్రతి రోజూ తడి, పొడి చెత్త ఇళ్ల వద్ద నుంచి సేకరించాలని, తద్వారా సంపద సృష్టించాలని కార్యదర్శి సబితకు సూచించారు. వన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్