అశ్వరావుపేటలో జరగనున్న ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధ్యక్షతన వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం జరగనున్న ఎన్నికల పక్రియకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని ఆదివారం ఎన్నికల సిబ్బందికి అందజేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. అధికారులు తమకు కేటాయించిన విధులను నిబద్ధతతో, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.