బూర్గంపాడు మండలంలో ఉన్న పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్యకు మండల రైతులు బుధవారం వినతిపత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి రైతులకు అందించేలాగా కృషి చేయాలని కోరారు.