విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకులం ఆవరణలో ఐటీసీ ఆధ్వర్యంలో 26 లక్షలతో నిర్మించిన శౌచాలయాలను ఎమ్మెల్యే వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడితేనే చదువుల్లో రాణించవచ్చన్నారు.