తండాల్లో వైభవంగా సీత్లా పండుగ వేడుకలు

50చూసినవారు
భద్రాద్రి జిల్లాల్లోని తండాల్లో బుధవారం లంబాడా గిరిజనులు సీత్లా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అశ్వరావుపేట, భద్రాచలం, కొత్తగూడెం,
పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లోని తండాల్లో సీత్లా భవానికి మేకలు, కోళ్లను బలి ఇచ్చి బంజారాలు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఊరేగింపుగా బోనాలను ఎత్తుకొని అమ్మవారికి నేపథ్యం సమర్పించి, వర్షాలు సమృద్ధిగా పడాలని మొక్కుకున్నారు.

సంబంధిత పోస్ట్