బీఈడీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

80చూసినవారు
బీఈడీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల నుండి ఉపాధ్యాయ శిక్షణ కొరకు గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశం పొందుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు భద్రాచలం ఐటిడిఏ పీవో ప్రతిక్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాల రాష్ట్రంలోనే అత్యుత్తమ శిక్షణ కళాశాలగా గుర్తింపు పొందిందని, కళాశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్