కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

71చూసినవారు
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదంగా గడిపారు. 849 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా 50, 895 రూపాయల ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్