నల్ల బంగారం వేలానికి పెట్టొద్దు

595చూసినవారు
నల్ల బంగారం వేలానికి పెట్టొద్దని సీఐటీయూ భద్రాద్రి జిల్లా ఉపాధ్యాకులు, దొడ్డ రవి, పట్టణ కార్యదర్శి కె. సత్య అన్నారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పాల్వంచ పట్టణంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని 60 బొగ్గుబావులను ప్రయివేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు ఉద్యమించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్