పాల్వంచలో దొంగల హల్ చల్

4289చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. దేవినేని రోజా నివాసంలో చొరబడి సుమారు 10 లక్షల విలువచేసే బంగారం, వెండి వస్తువులు చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఇటీవల ఇంటి యజమాని రోజా హైదరాబాద్ పని నిమిత్తం వెళ్లారు. శనివారం పాల్వంచ ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీసులు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్