దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5. 20 గంటల మధ్య పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన ఉండటంతో ఓ విద్యార్థిని సమయం అయిపోయిన తర్వాత రావటంతో గేట్లు వేశారు. దీంతో ఆ విద్యార్థిని బాధపడుతూ వెనుదిరిగింది.