భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ లో శనివారం పిడుగు పాటు చోటు చేసుకుంది. ట్రాన్స్ఫారంపై పిడుగుపడటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం తప్ప ప్రాణనష్ట ఏమి జరగలేదని సమాచారం. దీంతో అధికారులు పరుగులు తీసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.