మణుగూరులో భారీ వర్షం.. జలమయమైన ప్రధాన రహదారి

77చూసినవారు
మణుగూరులో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారి పైకి భారీగా వరద నీరు చేరింది. ద్విచక్ర వాహనదారులు ఈ వైపుగా వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటవద్దని సూచించారు. మణుగూరులో పలు ఇళ్లలోకి సైతం వరద నీరు చేరింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్