వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: పయం

70చూసినవారు
వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: పయం
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి ప్రవాహంలో ఉన్న కాలువలు, కల్వర్టులను దాటొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దని, ప్రయాణాలను కూడా కొత్త మార్గాల్లో కాకుండా రోజు వెళ్లే దారిలోనే ప్రయాణించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్