లడ్డూ వివాదం.. రక్తం ఉడికిపోయిందంటున్న భక్తుడు.. వీడియో వైరల్

73చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనపై ఎంతో మంది భక్తులు తల్లడిల్లిపోయారు. కలియుగ వైకుంఠనాథుడి మహాప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసి తన రక్తం ఉడికిపోయిందంటూ ఒక భక్తుడు భావోద్వేగానికి గురయ్యారు. గతంలో లడ్డూ ఇంటికి తీసుకెళ్లాక నెల రోజులవరకు నిల్వ ఉండేదని, కానీ గత ఐదేళ్లుగా చూస్తే 3 రోజుల్లోనే పాడయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్