ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. వాలంటైన్స్ డే 2025 సందర్భంగా ఆయన తన భాగస్వామిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని లలిత్ మోదీ ఆ పోస్టులో పేర్కొన్నారు. అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ పోస్ట్ ద్వారా లలిత్ మోదీ, సుష్మితా సేన్తో విడిపోయిన విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారని తెలుస్తోంది.