రేపు అల్ప పీడనం.. 4 రోజులు వర్షాలు

54చూసినవారు
రేపు అల్ప పీడనం.. 4 రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఈ నెల 24వ తేదీకి వాయుగుండంగా మారి.. తుఫానుగా బలపడే ఛాన్స్ ఉంది. అనంతరం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. కాగా ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి.