తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారట. ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆర్డర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ రాత్రి 8గంటలకు ముఖ్యనాయకులతో సీఎం రేవంత్, ఇంచార్జ్ భేటీ కానున్నారు. ఖమ్మం పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీ వెళ్లనున్నారు భట్టి. పీసీసీ రేసులో మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం.పీసీసీ చీఫ్ రేసులో మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ సహా పలువురు నేతలు ఉన్నప్పటికీ… అధిష్టానం మాత్రం మధుయాష్కి గౌడ్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది.