కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన పీవీ నరసింహారావు హనుమకొండలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. హయ్యర్ సెకండరీలో హైదరాబాద్ సంస్థానంలోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. హనుమకొండ కళాశాలలో బహిష్కరణకు గురికావడం వల్ల ఓ స్నేహితుని సహాయంతో నాగ్పూర్ వెళ్లి ఇంటర్మీడియట్ చదివారు. పీవీ పదేళ్ల వయసులో సత్యమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు.