కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: అరవింద్ చారి

52చూసినవారు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: అరవింద్ చారి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ బిసి పొలిటికల్ జెఎసి నేత అరవింద్ చారి మంగళవారం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించలేదని, అసలు తెలంగాణకు బడ్జెట్ లో ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా కేంద్రంపై పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కాళ్ళ నిరంజన్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్