నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం పర్యటిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్, అచ్చంపేట ప్రజలకు క్షమాపణలు చెప్పి అచ్చంపేట పట్టణానికి రావాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శనివారం డిమాండ్ చేశారు. అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కేటీఆర్ నెరవేర్చలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.