ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన జిల్లా అధ్యక్షుడు

559చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు, శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎదిగిన లాస్య నందిత ఎంతో భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్