విద్యుత్ షాక్ తో యువరైతు మృతి

19533చూసినవారు
విద్యుత్ షాక్ తో యువరైతు మృతి
ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో యువరైతు లొడ్డ తిప్పన్న అనే వ్యక్తి తమ తమ వ్యవసాయ పొలంలోని బోరు మోటర్ దగ్గర కేబుల్ వైరు అర్త్ కావడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్