ఆర్టీసీ రాయితీలపై కళాజాత అవగహన

56చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీదేవి సూచన మేరకు పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం డియం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఇస్తున్న రాయితీలపై కళాజాత నిర్వహించారు. విద్యార్థులకు బస్సు పాసులు, వ్యాపారులు, ఉద్యోగులకు సీజన్ టికెట్లు, జర్నలిస్టులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు రాయితీతో కూడిన బస్సు పాసులు, ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, కార్గో సేవలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్