నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న భారత్ మాల రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మక్తల్ మండలం దాసరి దొడ్డి గ్రామంలో వ్యవసాయ భూములు కోల్పోయిన బాధితులతో సంతకాల సేకరణ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు కొండన్న, గోవిందరాజులు, భగవంతు, రైతులు పాల్గొన్నారు