మహిళల రక్షణ కోసం షీటీం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని జిల్లా అదనపు ఎస్పి రామేశ్వరరావు అన్నారు. గురువారం బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం 1 0 9 8 నెంబర్ కు ఫోన్ చేయాలని అన్నారు. అదేవిధంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు.