మరికల్ మండల కేంద్రంలోని మస్జిద్ లో బుధవారం ఏర్పాటు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అల్లాహ్ దయతో ఉపవాస దీక్షలు విజయవంతంగా కొనసాగాలని చెప్పారు. ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.