పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి గురువారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రానున్నట్లు బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇటీవలే యాక్సిడెంట్ లో మరణించిన బాలరాజు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున రూ. 2 లక్షలు కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. కావున మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పాల్గొనాలని కోరారు.