రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

80చూసినవారు
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
తాండూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. తాండూర్ ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీని ఫ్లైవర్ బ్రిడ్జిపై వెనక నుంచి లారీ డ్రైవర్ అన్వర్ అజాగ్రత్తగా నడిపి ఢీ కొట్టాడు. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. లారీ క్యాబిన్లో ఇరుకున్న అన్వర్ (44) తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్