

భీమిని: ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి
దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల వ్యయం తగ్గి దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ జెడ్పిటిసి కొయ్యల ఎమాజీ అన్నారు. భీమిని మండలంలోని మల్లిడి గ్రామంలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, నాయకులు శ్రీనివాస్, కేశవరెడ్డి పాల్గొన్నారు.