కన్నేపల్లి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం కావడంతో పాటు సవరణలకు బెల్లంపల్లికి వెళ్లి అవస్థలు పడుతున్నారు. ఆధార్ లో ఏ చిన్న తప్పిదం ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండడంతో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.