యువకులు ఎటువంటి వ్యసనాలకు బానిస కావొద్దు

76చూసినవారు
యువకులు ఎటువంటి వ్యసనాలకు బానిస కావొద్దు
యువకులు ఎటువంటి వ్యసనాలకు బానిసకావద్దని బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ ఇంద్ర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందిస్తున్న ఉన్నత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్