చెన్నూర్ నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలో ఆదివారం పోచమ్మ గుడిలో అధిక సంఖ్యలో మహిళలు ఉపవాసంతో ఉంటూ ఇంటికో బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు.