బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల అంశాలను పొందుపరచాలి

83చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో బీసీల అంశాలను పొందుపరచాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో రెండు పార్టీల అధ్యక్షులకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.