జ్యువెల్లర్స్ యజమానులపై కేసు నమోదు

55చూసినవారు
జ్యువెల్లర్స్ యజమానులపై కేసు నమోదు
మంచిర్యాలలోని తుకారాం జ్యువెల్లర్స్ యజమానులు అమర్ నాథ్, వాసుదేవ్, నాందేవ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్ రెడ్డి బుధవారం తెలిపారు. గద్దెరాగడికి చెందిన అమ్జద్ పాషా ఏడు నెలల క్రితం వీరికి నగల తయారీకి 15 తులాల బంగారం ఇచ్చాడు. రోజులు గడిచినా ఆభరణాలు ఇవ్వకపోవడంతో పాటు వారం రోజులుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్