పోడు రైతులపై ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలు ఆపాలి

83చూసినవారు
పోడు రైతులపై ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలు ఆపాలి
మంచిర్యాల జిల్లాలో పోడు భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న రైతులపై ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలు ఆపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం శ్రీరాంపూర్ లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు చేసుకోకుండా అడ్డుకొని పంటలపై గడ్డి మందు కొట్టి చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జిల్లాలో మతోన్మాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్