దేశంలో నీట్తో సహా అనేక పరీక్షల్లో పేపర్ లీక్లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. దీనికి మోడీ సర్కార్ ప్రత్యక్ష బాధ్యత వహించాలని శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దేశంలోని యువతను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. నీట్, ఇతర పరీక్షలకు హాజరైన ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.