రాష్ట్రంలో పెరుగుతున్న తట్టు కేసులు

1576చూసినవారు
రాష్ట్రంలో పెరుగుతున్న తట్టు కేసులు
తెలంగాణ రాష్ట్రంలో తట్టు (మీజిల్స్) కేసులు పెరుగుతున్నాయి. 15 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. గత 6 నెలల్లో సుమారు 1000 కేసులు నమోదయ్యాయి. HYDలో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. పిల్లలకు వ్యాక్సిన్ లు వేయించకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ప్రాథమిక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు.

ట్యాగ్స్ :