పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు

84చూసినవారు
పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో శివ్వంపేట్ మండలం పిల్లుట గ్రామానికి చెందిన యువ నాయకుడు దాసరి కృష్ణ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి కండువా కప్పి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్