మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో జరుగుతున్న అడ్మిషన్ల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్నందున పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించారు. అలాగే జిల్లా పరిషత్ నిధులతో నిర్మిస్తున్న గౌడ సంఘం భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.