రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడు సిద్దిపేట జిల్లాకు చెందిన ఎండీ ఖాజామియా(30)గా గుర్తించారు. రాయపోల్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన ఖాజామియా.. గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటూ నీటి శుద్ధి మెకానిక్ గా పనిచేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తుండగా యావపూర్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది.