తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ తరఫున విజేతలుగా నిలిచిన కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిశారు. వారితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా విజయం సాధించిన వారిని రేవంత్ అభినందించారు.