అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

582చూసినవారు
అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి
అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం నుంచి నీల్ ఆచార్య అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. గాలింపు చేపట్టడంతో క్యాంపస్‌లోనే ఓ భవనం వద్ద మంగళవారం అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్