ఓటమి భయంతో మోదీ సర్కార్: ఉద్ధవ్ ఠాక్రే
By Somaraju 52చూసినవారుమోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే ఎన్నికల పోలింగ్లో లోపాలు తలెత్తాయని శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఓటమి భయంతో కాషాయ పాలకులు ఈసీ ద్వారా కుయుక్తులకు తెగబడ్డారని విమర్శించారు. తమకు ఆధిక్యం లభించే ప్రాంతాల్లో అధికారుల నిర్వాకం కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈవీఎంలను సరిగ్గా ఏర్పాటు చేయలేదని, యంత్రాలు పనిచేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.