మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. నోరు జారిన నితీష్ కుమార్

55చూసినవారు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ నోరు జారారు. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘దేశ వ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని కోరుకుంటున్నాం అన్నారు. దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. అనంతరం మళ్లీ తన తప్పును సరిదిద్దుకున్నారు. నరేంద్ర మోడీ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారని, అలాగే ముందుకు సాగుతారని తెలిపారు.

ట్యాగ్స్ :