బీజేపీకి 300కు పైగా సీట్లు: ప్రశాంత్ కిషోర్

61చూసినవారు
బీజేపీకి 300కు పైగా సీట్లు: ప్రశాంత్ కిషోర్
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. బీజేపీ 303 సీట్లు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ గెలుచుకోవచ్చన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల కంటే మరికొన్ని సీట్లు ఎక్కువగానే వస్తాయని తెలిపారు. ‘పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు ఏమీ కనిపించదు. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.